ప్రతిపక్ష నేతలను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని కేంద్ర ఎన్నికల సంఘానికి NDA నేతలు ఫిర్యాదు చేశారు. అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఏపీలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సమస్యాత్మక పోలింగ్ బూత్ల్లో వీడియో రికార్డింగ్ చేపట్టాలని కోరారు.