‘ఇకపై ప్రతీ మ్యాచ్‌ మాకు సెమీఫైనల్‌ లాంటిది’

61చూసినవారు
‘ఇకపై ప్రతీ మ్యాచ్‌ మాకు సెమీఫైనల్‌ లాంటిది’
హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఓటమి అనంతరం ఆర్సీబీ హెడ్ కోచ్‌ ఆండీ ప్లవర్ మాట్లాడాడు. ‘‘ఇది స్పష్టంగా మాకు నాకౌట్ స్టేజ్‌. ప్రతీ మ్యాచ్‌ ఇప్పుడు మాకు సెమీఫైనల్ లాంటిది. కానీ, ఇప్పుడు మేం బలంగా తిరిగి రావడంపై దృష్టిపెట్టాం. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ మాకు నిజంగా చాలా కఠినమైనది. వారు గొప్పగా ఆడి భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. మిడిలార్డర్‌లో మా జట్టు బ్యాట్‌తో పోరాడినందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను’’ అని పేర్కొన్నాడు.

సంబంధిత పోస్ట్