బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నివాసానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యుల్ని పలకరించారు. ఆ తర్వాత కాల్పుల పగరిణామాలపై చర్చించారు. పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లారెన్స్ బిష్ణోయ్ అంతు చూస్తామని హెచ్చరించారు. కాల్పుల ఘటనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు.