మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా మంగళవారం భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ 'నేను ఒంటరి కాదు.. మంచి చేసిన జగన్కు మద్దతుగా ప్రతీ ఇంట్లో సైన్యం ఉందని పేర్కొన్నారు. మీ జగన్కు కోట్లాది మంది సైన్యం ఉందని ఉద్ఘాటించారు. సంక్షేమ, రైతు రాజ్యాన్ని చంద్రబాబు కూటమి అంతం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. తమ ఓటుతో కూటమి కుట్రలను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.