వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. సోషల్ మీడియాలో చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇంటింటికీ పెన్షన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణమంటూ ఐవీఆర్ఎస్ ద్వారా ఓటర్లు, పెన్షన్దారులను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై స్పందించిన ఈసీ.. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ డీజీని ఆదేశించింది.