విజయవాడలోని మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ డీవైఎఫ్ఐ కార్యకర్తలు మంత్రి కార్యాలయం ముట్టడికి యత్నించారు. ముట్టడికి యత్నించిన డీవైఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అడ్డగించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది.