కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. 8మంది నిందితులు అరెస్ట్

60చూసినవారు
కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. 8మంది నిందితులు అరెస్ట్
శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువులో ఈనెల 24న ఓ చికెన్ షాప్ యజమాని అయిన చలపతి అనే వ్యక్తి కిడ్నాప్ కు గురైన విషయం తెలిసిందే. కాగా ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు డిఎస్పి వాసుదేవన్ మాట్లాడుతూ.. చలపతికి బావమరిది అయిన భానుచందర్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి తన స్నేహితులతో కలిసి ఈ కిడ్నాప్ చేశారని తెలిపారు. కొత్తచెరువు, ముదిగుబ్బ పోలీసుల సహకారంతో ఈ కేసులో 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్