AP: ఇంటర్ విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నెలలో కూడా రాయితీ బస్పాస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఏపీలో ఈసారి గతానికి భిన్నంగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్లోనే వారికి తరగతులు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. దీంతో ఇంటి నుంచి కాలేజీకి వెళ్లి చదువుకునే విద్యార్థులకు దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.