ఏపీలోని విశాఖపట్నంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలికపై ఆమె మేనమామ పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గర్భవతైంది. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.