విజయవాడలో సీఎం జగన్పై రాయితో దాడి జరిగిన ఘటనకు సంబంధించి కేసు నమోదైంది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదుతో సింగ్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏసీపీ స్థాయి అధికారులతో కూడిన 6 ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.