తలలు పగిలేలా కర్రలతో ఒకరిపై ఒకరు దాడి (వీడియో)

51చూసినవారు
ఏపీలో మరో దారుణం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలోని రెడ్డిగూడెం రోడ్డుపై ఒకరిపై ఒకరు దాడికి దిగారు. తలలు పగిలి రక్తం వచ్చేలా కర్రలతో కొట్టుకున్నారు. గాయపడిన వారిలో వెంకటేశ్వరరావు (ఏఆర్ కానిస్టేబుల్), శివ, మరో ఇద్దరు ఉన్నారు. వీరిని స్థానికులు విస్సన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే గొడవ ఎందుకు పడ్డారనే విషయంపై క్లారిటీ లేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్