ప్రకాశం జిల్లా కొనకనమిట్ల జంక్షన్ వేదికగా జరిగిన సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. "నిమ్మగడ్డ రమేష్తో ఈసీకి ఫిర్యాదు చేయించి పెన్షన్లను చంద్రబాబు అడ్డుకున్నారు. పేదల భవిష్యత్ను అడ్డుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి. ఇవి జగన్కు బాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు.. ప్రజలకు, బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు." అని సీఎం అన్నారు.