రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ నాయకత్వం అవసరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ గెలిస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో పేదరికం గత ఐదేళ్లలో గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ఇచ్చిన మాటను, హామీని నెలబెట్టుకొని ఓటు అడుగుతున్న ఏకైక వ్యక్తి జగన్ అని కొనియాడారు. విజయనగరం వేదికగా జరిగిన వైసీపీ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.