బుధవారం గుజరాత్తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలైంది. గుజరాత్ బ్యాటర్ రషీద్ ఖాన్ చివరి బంతికి ఫోర్ కొట్టి తన జట్టును గెలిపించాడు. మ్యాచ్ అనంతరం రాజస్థాన్ ఓటమిపై సంజూ శాంసన్ స్పందించాడు. ‘మీరు ఎక్కడ మ్యాచ్ను కోల్పోయారని భావిస్తున్నారు అని కామెంటేటర్ అడగ్గా.. గేమ్లోని చివరి బంతి వల్లే మేం ఓడిపోయాం’ అని సంజూ రిప్లై ఇచ్చాడు. దాంతో ‘అవునా’ అంటూ కామెంటేటర్ ఆశ్చర్యంగా స్పందించాడు.