టీడీపీ, జనసేన, బీజేపీ నేత‌లతో బాలకృష్ణ భేటీ

73చూసినవారు
టీడీపీ, జనసేన, బీజేపీ నేత‌లతో బాలకృష్ణ భేటీ
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేత‌ల‌తో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో ఎన్నికల ప్రచారంపై శ్రేణుల‌కు ఆయ‌న దిశా నిర్దేశం చేశారు. వైసీపీ ఆగడాలకు ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రతి ఓటరు ఆలోచించి ఓటు వేస్తే వైసీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్లక తప్పదన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో హిందూపురంలో NDA జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్