శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారంపై శ్రేణులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. వైసీపీ ఆగడాలకు ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రతి ఓటరు ఆలోచించి ఓటు వేస్తే వైసీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్లక తప్పదన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో హిందూపురంలో NDA జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చారు.