మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే వైయస్సార్ ఆసరా పథకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని బాపట్ల శాసనసభ్యులు కోనా రఘుపతి అన్నారు. శనివారం వైయస్సార్ ఆసరా పథకం వేడుకలు స్థానిక వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోనా రఘుపతి పాల్గొన్నారు. మహిళల ఆర్థికంగా బాలోపేతం అయితే కుటుంబం బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు సిబ్బంది నాయకులు పాల్గొన్నారు.