గుంటూరులో సందడి చేసిన హీరో కార్తీ

58చూసినవారు
ప్రముఖ హీరో కార్తీ సోమవారం గుంటూరు జిల్లాలో సందడి చేశారు. ఇటీవల విడుదలైన సత్యం సుందరం చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా నంబూరు వీవీఐటీ కళాశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో చిత్ర డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తో పాటు కార్తీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ.. ఈ చిత్రం స్నేహం గురించి చెబుతుందని కుటుంబ సభ్యులు అందరితో కలిసి చూడదగ్గ చిత్రం అని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి డాన్స్ వేశారు.

సంబంధిత పోస్ట్