దసరా మహోత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన లేళ్ల అప్పిరెడ్డి

75చూసినవారు
గుంటూరు చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులు పాటు విశేష పూజలు, అలంకరణలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. దసరా మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను సోమవారం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు ఆవిష్కరించారు. దసరా మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దైవదర్శనం చేసుకోవాలని అప్పిరెడ్డి సూచించారు.

సంబంధిత పోస్ట్