గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ అజీజ్

50చూసినవారు
గుంటూరు తూర్పు సబ్ డివిజన్ పరిధిలో గంజాయి అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టామని డీఎస్పీ అజీజ్ తెలిపారు. సోమవారం ఆయన పోలీస్ స్టేషన్లో మాట్లాడారు. గంజాయి రవాణా చేసినా విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే రౌడీషీటర్ల పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఐలు వీరయ్య, శివప్రసాద్, సోమయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్