వైసీపీ అధినేత జగన్, మాజీ ఎంపీ నందిగం సురేశ్ తో ములాఖత్ వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవీ డిమాండ్ చేశారు. తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మాధవీ మాట్లాడారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో సురేశ్ లేడని జగన్ చెప్తున్నారని, అన్ని నిర్ధారించుకున్న తర్వాతే సురేశ్ ని అరెస్ట్ చేసిన విషయాన్ని జగన్ గ్రహించాలని హితవు పలికారు.