వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం

50చూసినవారు
వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం
విజయవాడలో వరదల బాధితులను ఆదుకునేందుకు దివీస్ సీఈఓ దివి కిరణ్ ఆదివారం హైదరాబాదులో మంత్రి నారా లోకేశ్ ను కలిసి రూ. 5కోట్ల చెక్కును అందజేశారు. ఈ నెల 1 నుంచి 8వ వరకు వరద బాధితులకు ఆహారాన్ని అందజేసేందుకు గాను అక్షయపాత్ర ఫౌండేషన్కు మరో రూ. 4. 8 కోట్లను దివీస్ సంస్థ అందజేసింది. మొత్తంగా రాష్ట్రంలో వరద బాధితుల కోసం రూ. 9. 8 కోట్ల విరాళాన్ని అందించిన దివీస్ సంస్థను మంత్రి లోకేశ్ అభినందించారు.

సంబంధిత పోస్ట్