నిడుబ్రోలు: సమ్మర్ స్టోరేజ్ ని పరిశీలించిన కమిషనర్ రమేష్ బాబు

79చూసినవారు
నిడుబ్రోలు: సమ్మర్ స్టోరేజ్ ని పరిశీలించిన కమిషనర్ రమేష్ బాబు
గుంటూరు జిల్లా, పొన్నూరు పట్టణం నిడుబ్రోలులోని సమ్మర్ స్టోరేజ్ ను శనివారం మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పరిశీలన చేశారు. సమ్మర్ స్టోరేజ్ ప్లాంట్లులో నీటి మోటర్లు పనితీరు, సిబ్బంది హాజరు, పరిసరాలను పరిశీలించారు. పట్టణ ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు అందించేందుకు సిబ్బంది విధిగా పనిచేయాలని అలసత్వం వహిస్తే చర్యలు చేపడతామని హెచ్చరించారు. వాటర్ పైపులైన్లు లీకులు సత్వరమే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్