కాకుమానులో గాంధీ జయంతి వేడుకలు

75చూసినవారు
కాకుమానులో గాంధీ జయంతి వేడుకలు
గుంటూరు జిల్లా కాకుమాను మండలం తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ 155వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల తహసిల్దార్ పి. వెంకటస్వామి పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ స్వాతంత్ర సమరంలో చేసిన పోరాటాన్ని తహసిల్దార్ వివరించారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని తెలిపారు. పలువురు సిబ్బంది గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్