మంత్రి లోకేశ్ కు హీరో సాయిధరమ్ తేజ్ విరాళం అందజేత

66చూసినవారు
మంత్రి లోకేశ్ కు హీరో సాయిధరమ్ తేజ్ విరాళం అందజేత
వరదలతో నిరాశ్రయులుగా మారిన ప్రజలను ఆదుకోవడానికి సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ రూ. 10 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆయన చెక్కును మంత్రి లోకేశ్ కు బుధవారం వెలగపూడి సచివాలయంలోని 4వ బ్లాక్ లో అందజేశారు. ఆయనతో పాటు డిక్షన్ గ్రూప్ ప్రతినిధులు రూ. 1 కోటి వరద బాధితుల సహాయార్ధం విరాళంగా అందజేశారు. వారికి మంత్రి లోకేశ్ ధన్య వాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్