పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా పి. డి. ఎఫ్ అభ్యర్థి

73చూసినవారు
పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా పి. డి. ఎఫ్ అభ్యర్థి
రానున్న శాసనమండలి ఎన్నికలలో పట్టభద్రుల స్థానానికి పి. డి. ఎఫ్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని యు. టి. ఎఫ్ జిల్లా అధ్యక్షులు పి. ప్రేమ్ కుమార్ తెలియజేశారు. వినుకొండ యు. టి. ఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం పల్నాడు జిల్లా కార్యదర్శి ఎం. రవిబాబు అధ్యక్షతన ఐదు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటు ను వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్