ఏపీలో జగన్ సర్కారుకు మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని మారుస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జవహర్రెడ్డి స్థానంలో నీరబ్ కుమార్ ప్రసాద్ లేదా ఆర్పీ సిసోడియా కొత్త ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఆదేశాలు త్వరలో వెలువడనున్నట్లు సమాచారం.