సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలోని అచ్చంపేట జంక్షన్లో శుక్రవారం ‘మేమంతా సిద్ధం’ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్పై విమర్శలు చేశారు. పెత్తందారులకు చంద్రబాబు, పవన్ అనుకూలమని విమర్శించారు. తాము మాత్రం పేదల కోసమే ఆలోచిస్తామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు పెత్తందారుల అనుకూల వర్గానికి, పేదల అనుకూల వర్గానికి మధ్య వార్ జరుగుతోందన్నారు.