హిమాచల్ ప్రదేశ్లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి బాలీవుడ్ నటి, బిజెపి అభ్యర్థి కంగనా రనౌత్ పై కాంగ్రెస్ పార్టీ యామీ గౌతమ్ కు టికెట్ ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం, హిమాచల్ కాంగ్రెస్ ఈ చర్చలను పుకార్లుగా అభివర్ణించింది. ఈ విషయంలో యామీ గౌతమ్ ధర్తో ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని హిమాచల్ కాంగ్రెస్ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.