తనేంటో తన మనస్తత్వం ఏంటో వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు తెలుసని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. "మూడేళ్లుగా తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. మా కుటుంబంలో కూడా చీలికలు తెచ్చారు. మాపై ఎంత ద్వేషంతో మాట్లాడుతున్నారో చూడండి. ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి. అయినా నేను ప్రజల్లోనే ఉంటా.. ప్రజల కోసం పని చేస్తా." అని అవినాష్ అన్నారు. పులివెందులలో ఇవాళ జరిగిన బలిజ సంఘం ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.