సీఎం జగన్ బిల్డప్ బాబాయి అని, సిద్ధం సభలో డ్రోన్ చూసి భయపడ్డాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. సోమవారం అనంతపురంలో జరిగిన శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ.. ‘సభకు జనం రారని తెలిసి గ్రాఫిక్స్ కోసం గ్రీన్ మ్యాట్ వేశారు. అరగంట అంబటి, బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను బండబూతులు తిట్టారు. డ్రోన్ను చూసి సీఎం జగన్, మంత్రులు పిల్లల్లా భయపడిపోతున్నారు. కూటమిని చూసి వైసీపీకి వణుకు పుట్టింది.’ అని అన్నారు.