ఏపీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. నిన్నటి దాకా వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు తిట్టడమే కాకుండా వాలంటీర్లపై నీచమైన అపవాదులు వేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం వస్తే వాలంటీర్ల జీతం రూ. 10 వేలకు పెంచుతామనడం చంద్రబాబు మాయ మాటలు కాదా? ఇది ఎన్నికల స్టంట్ కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు కదా కనీసం ఎమ్మెల్యే కూడా కాలేరని చెప్పారు. చంద్రబాబు ప్రజా నాయకుడు కాదని అన్నారు.