చంద్రబాబు ముస్లింలను మోసం చేశారు: మాజీ డిప్యూటీ సీఎం

73చూసినవారు
చంద్రబాబు ముస్లింలను మోసం చేశారు: మాజీ డిప్యూటీ సీఎం
AP: వక్ప్ బిల్లుపై మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కడప జిల్లాలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం సవరణ బిల్లుకు టీటీడీ మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. బిల్లుకు ఆమోదం తెలిపి ముస్లింలను మోసం చేశారన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ముస్లింలను వాడుకుని వారిని వెన్నుపోటు పొడిచారంటూ ఆరోపించారు. అలాగే తాము ఎప్పటికీ బీజేపీతో కలిసేది లేదని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్