న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలి: సీజేఐ

76చూసినవారు
న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలి: సీజేఐ
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇకపై తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలని ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఆదేశాలు జారీ చేశారు. ముందుగా తన ఆస్తుల వివరాలను వెల్లడించి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోని సీజేఐ, న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్