అభ్యర్థుల ప్రకటనలో సీనియర్లకు టీడీపీ అధిష్టానం షాకిచ్చింది. మాజీ మంత్రి దేవినేని ఉమను పక్కనపెట్టింది. మూడో జాబితాలో మైలవరం సీటును వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్కు కేటాయించింది. దీంతో దేవినేని ఉమకు సీటు లేనట్లేనని తేలిపోయింది. మరో కీలకనేత గంటా శ్రీనివాసరావు, పెందుర్తిలోనూ బండారు సత్యనారాయణమూర్తి, మాజీ మంత్రి కళా వెంకట్రావు తదితరులకు పార్టీ షాకిచ్చింది.