ప్రతి అడుగు.. స్వచ్ఛత వైపు

65చూసినవారు
ప్రతి అడుగు.. స్వచ్ఛత వైపు
చిత్తూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. ప్రతి అడుగు స్వచ్ఛత వైపు వేయాలని నగర మేయర్ ఎస్. అముద, కమిషనర్ పి.నరసింహ ప్రసాద్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతాహీ సేవ-2024 కార్యక్రమంలో భాగంగా మంగళవారం నగరపాలక కార్యాలయ ఆవరణంలో అధికారులు, నగరపాలక ఉద్యోగులు "స్వచ్ఛత ప్రతిజ్ఞ" చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తాము ఉండే పరిసరాలను, తమ ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్