చిత్తూరు నగరంలో నీటి సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు నగరకమిషన్ జె అరుణ చెప్పారు. గురువారం కమిషనర్ 28వ వార్డు వినాయకపురం పరిధిలో తాగునీటి సరఫరాను పరిశీలించారు. 2బోర్లలో నీటి పరిమాణం తగ్గిపోవడంతో నీటికి ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు తెలుపగా ఈ విషయంపై అధికారులతో చర్చించారు. నీటికొరత తలెత్తకుండా ప్రస్తుతం సరఫరాచేస్తున్న ట్రిప్పులకు అదనంగా ట్రిప్పులు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.