అంకితభావంతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన మునెమ్మ సేవలు మరుపురానివని చిత్తూరులోని దొడ్డిపల్లి జడ్పీ పాఠశాల హెచ్. ఎం సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అన్నారు. 39 ఏళ్లుగా పనిచేసిన మునెమ్మ రిటైరయ్యారు. ఈ సందర్భంగా ఆమెను సన్మానించారు. క్రమశిక్షణ, నీతి నిజాయితీకి మారుపేరు మునెమ్మ అని ప్రశంసించారు.