ఇతర రాష్ట్రాల నుండి జనాన్ని తీసుకువచ్చి ర్యాలీలో పాల్గొనాల్సిన అవసరం తమకు లేదని ఎమ్మెల్సీ భరత్ బుధవారం స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తప్పుడు వీడియోలు ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టమని అన్నారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితువు పలికారు. తమ వెంట కుప్పం ప్రజలు, వైసిపి సైనికులు ఉన్నారని తెలిపారు.