గుడుపల్లెలో సాయుధ బలగాలతో పోలీసులు కవాతు

82చూసినవారు
గుడుపల్లెలో సాయుధ బలగాలతో పోలీసులు కవాతు
గుడుపల్లె మండల కేంద్రంలో మంగళవారం ఎస్సై లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ బలగాలతో కలిసి స్థానిక పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతవరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని ప్రజల్లో భరోసా కల్పిస్తున్నామని ఎస్సై లక్ష్మీకాంత్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్