పురాణాల ప్రకారం పుష్కరుడు అనే బ్రాహ్మణుడు పరమేశ్వర
ుడి కోసం తపస్సు చేసి, జీవుల పాపాలతో అపవిత్రమైన నదులు తన స్పర్శతో పునీతమయ్యే వరం కావాలని
కోరుకుంటాడు. తపస్సు మెచ్చిన పరమేశ్వరుడు పుష్కరుడికి 12 ఏళ్లకు 12 నదుల్లో ఏడాదికి ఓ నది చొప్పున ఏ నదిలోకి ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని వరమిచ్చారు. ఈ వరంలో భాగం కావాలని దేవగురువు బృహస్పతి అడగడంతో.. బృహస్పతి రాశిమారినప్పుడే పుష్కరుడు ఆ నదిలోకి ప్రవేశిస్తాడు.