నగరి: స్థానిక మండలపరిషత్ ప్రాథమిక పాఠశాల (బాలికలు)లో పూజ, రిత్వినశ్రీ అనే దాతలు అభ్యసనా సామగ్రిని వితరణగా అందించారు. మంగళవారం పాఠశాలకు వెళ్లిన వారు ప్రధానోపాధ్యాయులు సురేష్ ద్వారా విద్యార్థులకు పలకలు, నోట్బుక్స్, బ్యాగ్లు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్ మీన, టీడీపీ నాయకులు గుణశేఖర్, జ్యోతినాయుడు, చిట్టి, రాజశేఖర్, ఎల్ కె రాజ, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.