పాఠశాల ఆవరణను ప్రతి విద్యార్థి పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రధానోపాధ్యాయులు జ్ఞానప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం శ్రీహరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు స్వచ్ఛత హి సేవ కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఉపాధ్యాయులు వెoకమరాజు, విజయకుమార్, గోపి, విజయవర్మ పంచాయతీ కార్యదర్శి బాబు, ఇంజినీర్ జగదీష్ పాల్గొన్నారు.