ఆటోను ఢీకొన్న వోల్వో బస్సు -ఏడు మందికి తీవ్ర గాయాలు

65చూసినవారు
ఆటోను ఢీకొన్న వోల్వో బస్సు -ఏడు మందికి తీవ్ర గాయాలు
పలమనేరు పట్టణసమీపం నాగమంగళం రిలయన్స్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఆటోను వెనుక నుంచి ఢీకొన్న వోల్వో బస్సు. ఈ ప్రమాదంలో సుమారు ఏడు మందికి గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని108 ఆంబులెన్స్ లో పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారు బైరెడ్డిపల్లి మండలం బెల్లం మడుగు గ్రామానికి చెందిన వ్యక్తులు కీలపట్ల వద్ద మామిడికాయలు కోయడానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో బస్సు ఆటోని వెనుక వైపు ఢీకొట్టింది.

సంబంధిత పోస్ట్