సుందరీకరణ పనులను త్వరలోనే ప్రారంభిస్తాం: ఎమ్మెల్యే

64చూసినవారు
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం చిత్తూరులోని కట్టమంచి, గంగినేని చెరువుల వద్ద సుందరీకరణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడారు, చెరువుల వద్ద మహనీయుల విగ్రహ ఏర్పాట్లకు స్థలాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పట్టణ వాసులకు ఆహ్లాదం కలిగించేలా పనులు చేపడతామని ఎమ్మెల్యే చెప్పారు.

సంబంధిత పోస్ట్