చిత్తూరు నగరంలోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో హెల్త్ ఎడ్యుకేటర్ ఆఫీసర్ గా పనిచేస్తున్న పి. గుణశేఖర్ ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా శనివారం కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఆరోగ్యశాఖ అధికారి ప్రభావతి ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం జరిగింది. పి. గుణశేఖర్ దంపతులను శాలువాలతో సన్మానించారు. ఆయన సేవలను కొనియాడారు.