ఒకటైన మహాసముద్రం, కామసాని వర్గీయులు

1065చూసినవారు
ఒకటైన మహాసముద్రం, కామసాని వర్గీయులు
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో మంగళవారం ఉగాది రోజున వైసీపీ నాయకులు అంతర్గత విభేదాలు వీడి ఏకమయ్యారు. నియోజకవర్గంలో కొన్ని నెలలపాటు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి అండతో కామసాని వర్గీయుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వీరితో చర్చలు జరిపారు. దీంతో వీరు అంతర్గత విభేదాలను వీడి వైసీపీలో కొత్త జోష్ నింపారు.

సంబంధిత పోస్ట్