20 కుటుంబాలు వైసిపిలో చేరికలు

1869చూసినవారు
కుప్పం మండల వెండుగంపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం సర్పంచ్ లక్ష్మీ ధర్మాచారి ఆధ్వర్యంలో 20 కుటుంబాలు టీడీపీ ని వీడి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి ధర్మాచారి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. కుప్పంలో వైసిపి జెండా ఎగురవేయడానికి కృషి వేయాలని ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఆయన సూచించారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్