ఆయుష్మాన్ సేవలను పేదలకు అందించండి

74చూసినవారు
ఆయుష్మాన్ సేవలను పేదలకు అందించండి
ఆయుష్మాన్ కార్డులు పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని మాజీ సైనికుల సంక్షేమ నాయకుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు కోరారు. ఈ విషయంపై మదనపల్లె ఎంపీడీవోను గురువారం కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రూ. 5లక్షల వైద్య ఖర్చులు అందించి కేంద్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్