వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నగరి మండలంలోని తెరణి గ్రామంలో సచివాలయ భవనంపై ఉన్న నవరత్నాల పలకాన్ని తొలగించారు. భవనం ముందు ఉన్న ప్రారంభోత్సవ శిలాఫలకంపై పెయింట్ వేసి మూసేశారు. ఈ సంఘటనపై గురువారం స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు సమాచారం అందించారు.