వడమాలపేట మండలం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం శ్రీనివాసుడు రథాన్ని అవరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు స్వామి వారు నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ కోలాహలంగా రథోత్సవం నిర్వహించారు.